కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో ఓ రేంజ్ ఫాం లో ఉన్న విషయం తెలిసిందే. అమ్మడు నటిస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందిస్తున్నాయి. అందుకే టాలీవుడ్ కు రష్మిక మందన్న లక్కీ హీరోయిన్ అయ్యింది. ప్రస్తుతం వరుస సినిమాలతో రష్మిక తన క్యాలెండర్ బిజీ చేసుకుంది. అల్లు అర్జున్ పుష్పతో పాటుగా శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తుంది రష్మిక మందన్న.

కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో రష్మిక పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా వెయిట్ ఉంటుందని అంటున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నుండి ఓ పిక్ లీక్ చేసింది రష్మిక. సినిమా ఎడిటింగ్ కు సంబందించిన తన పిక్ ఒకటి తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసింది అమ్మడు. ఈమధ్యనే షెడ్యూల్ మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుందని తెలుస్తుంది.

రామ్ తో రెడ్ సినిమా సస్కెస్ తర్వాత డైరక్టర్ కిశోర్ తిరుమల చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా టైటిల్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పాడు డైరక్టర్. శర్వానంద్, రష్మిక మందన్నల జోడీ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తుంది. ఓ పక్క బాలీవుడ్ లో సినిమా చేస్తున్న రష్మిక ముంబై టూ హైదరాబాద్ ఒక షెడ్యూల్ అక్కడ మరో షెడ్యూల్ ఇక్కడ అనే విధంగా తిరుగుతుందని తెలుస్తుంది. పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు కాకుండా మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. టాలీవుడ్ టాప్ ప్లేస్ దక్కించుకున్న అమ్మడు చూస్తుంటే ఇదే ఫాం మరికొన్నాళ్లు కొనసాగించేలా ఉంది. పుష్ప తో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో రష్మిక తప్పకుండా మరో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకునేలా ఉందని చెప్పొచ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: