ఇటీవల షారుఖ్ ఖాన్, కాజోల్ మరోసారి రాజ్కుమార్ హిరానీ తదుపరి చిత్రంలో కలిసి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి రుమార్లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు షారూఖ్ ఖాన్ 'పఠాన్' చిత్రంతో చాలా కాలం తర్వాత వెండితెరపైకి తిరిగి వస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం, దీపికా పదుకొనే కూడా కనిపించనున్నారు. కత్రినా కైఫ్, అనుష్క శర్మలతో కలిసి షారుఖ్ ఖాన్ చివరిసారిగా "జీరో" చిత్రంలో 2018 సంవత్సరంలో వెండితెరపై కనిపించారు. ఈ సినిమాతో పాటు అంతకుముందు కూడా వరుస పరాజయాలను చవి చూసిన ఆయన కొన్నాళ్ళు సినిమాలకు దూరమయ్యారు. మరోవైపు కరోనా కూడా తోడవ్వడంతో కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ సమయంలో పలువురు దర్శకులతో చర్చలు జరిపారు. అట్లీతో సినిమా అనే విషయం చాలాకాలంగా అటు బిటౌన్ లోనూ ఇటు కోలీవుడ్ లోనూ చక్కర్లు కొడుతోంది.
ఇటీవల షారుఖ్ ఖాన్, కాజోల్ మరోసారి రాజ్కుమార్ హిరానీ తదుపరి చిత్రంలో కలిసి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి రుమార్లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు షారూఖ్ ఖాన్ 'పఠాన్' చిత్రంతో చాలా కాలం తర్వాత వెండితెరపైకి తిరిగి వస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం, దీపికా పదుకొనే కూడా కనిపించనున్నారు. కత్రినా కైఫ్, అనుష్క శర్మలతో కలిసి షారుఖ్ ఖాన్ చివరిసారిగా "జీరో" చిత్రంలో 2018 సంవత్సరంలో వెండితెరపై కనిపించారు. ఈ సినిమాతో పాటు అంతకుముందు కూడా వరుస పరాజయాలను చవి చూసిన ఆయన కొన్నాళ్ళు సినిమాలకు దూరమయ్యారు. మరోవైపు కరోనా కూడా తోడవ్వడంతో కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ సమయంలో పలువురు దర్శకులతో చర్చలు జరిపారు. అట్లీతో సినిమా అనే విషయం చాలాకాలంగా అటు బిటౌన్ లోనూ ఇటు కోలీవుడ్ లోనూ చక్కర్లు కొడుతోంది.