మహేష్ బాబు కి జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుండగా పరశురామ్ పెట్ల దీనిని తెరకెక్కిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని విలన్ గా యాక్ట్ చేస్తున్నట్లు టాక్. కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్ తో పాటు టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇటీవల మొత్తం మూడు షెడ్యూల్స్ జరుపుకున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా, నేడు అక్కడి ఫెమస్ ట్రైడెంట్ హోటల్ లో కీలక సన్నివేశాలు తీస్తున్నారట. అలానే ఆ హోటల్ ఒక భారీ ఫైట్ కూడా ప్లాన్ చేసారని, దీనిని రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా తీస్తున్నారని అంటున్నారు.
ఇప్పటికే మహేష్ బాబు అభిమానులు తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ సర్కారు వారి పాట మూవీపై ఎంతో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం పలు బ్యాంకులను కుదిపేసిన ఆర్ధిక నేరాలని బేస్ చేసుకుని దర్శకడు పరశురామ్ ఈ సినిమాని తీస్తున్నట్లు టాక్. మొత్తంగా ఈ సినిమా రేపు విడుదల తరువాత అందరినీ ఎంతో ఆకట్టుకుని సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా, సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి