ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని వర్గాల ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా లవ్ స్టోరీ.  నవతరం దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా పై ప్రస్తుతం అందరి లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగానే శేఖర్ కమ్ముల సినిమాలు అంటే ఒక రేంజిలో అంచనాలు నెలకొంటాయి. ఎందుకంటే ఆయన సినిమాలు అన్ని నిజజీవితానికి,  ప్రతి ఒక్కరి లైఫ్ స్టోరీ కి దగ్గరగా ఉంటాయి.  అందుకే  శేఖర్ కమ్ముల సినిమాలు వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి.



 ఇకపోతే ఇటీవల విడుదలైన లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈ సినిమా పై మరోసారి అంచనాలను పెంచుతుంది.  ట్రైలర్ లోని ప్రతి డైలాగ్ కూడా అటు సగటు ప్రేక్షకుడి మనసును తాకింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన విడుదల కాబోతుంది.  మొదట ఓటిటీలో విడుదలవుతుందని టాక్ వినిపించినప్పటికీ.. చివరికి థియేటర్లలోనే గ్రాండ్గా విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్ర బృందం. లవ్ స్టోరీ సినిమా సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.  ఇక ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 లవ్ స్టోరీ సినిమా కోసం దర్శకుడు శేఖర్ కమ్ముల  రెండు క్లైమాక్స్ లను షూట్ చేశారు అంటూ ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. రెండు రకాల యాంగిల్స్ లో క్లైమాక్స్ చిత్రీకరించారట. ఇక ఈ రెండింటికీ సెన్సార్ కూడా పూర్తి చేశారట చిత్రబృందం. లవ్ స్టోరీ సినిమాలో రేప్,కులం, స్త్రీ పురుష సమానత్వం అనే అంశాలపై సున్నితంగా అవగాహన కల్పించబోతున్నాడట దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా కోసం రెండు రకాల క్లైమాక్స్ లో తెరకెక్కించగా.. ఇక ఈ సినిమాలో ఎలాంటి క్లైమాక్స్ ఉండబోతుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.  వీటికి సంబంధించిన వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: