మహానటి ప్రేక్షకులను మాయ చేస్తోంది. ఎవరూ ఊహించని నిర్ణయాలతో ఝలక్ ఇస్తోంది.  సాధారణంగా స్టార్‌ హీరోయిన్లు ప్రయోగాలకు చాలా దూరంగానే ఉంటారు. టాప్‌ హీరోలతో సినిమాలు చేసి నంబర్‌ గేమ్‌లో ముందుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తుంటారు. కానీ కీర్తీ సురేష్‌ మాత్రం పెద్ద సాహసమే చేస్తోంది. ఆమె డెసిషన్స్ షాక్ కు గురి చేసేలా ఉంటున్నాయి. టాప్ హీరోయిన్స్ ఎవరూ టచ్‌ చేయని సబ్జెక్ట్స్‌కి సంతకం చేస్తోంది. మరి కీర్తి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి రీజన్ ఏంటి అనే దానిపై రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కీర్తి సురేశ్‌కి బోల్డంత టాలెంట్ ఉన్నా.. జాతీయ స్థాయిలో అవార్డ్ అందుకున్నా ఇప్పటికీ నంబర్‌ గేమ్‌లో వెనకబడే ఉంది. ఇలాంటి  సమయంలో 'సర్కారు వారి పాట'లో మహేశ్ బాబుతో జోడీ కట్టగానే, కీర్తీ టాప్ రేసులో ముందుకెళ్తుందని ఈమె ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. కానీ ఈ మూవీ తర్వాత కీర్తి చేస్తోన్న సినిమాలు చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

కీర్తీ సురేశ్‌ ప్రస్తుతం చిరంజీవితో 'భోళా శంకర్' సినిమా చేస్తోంది. అయితే ఈ మూవీలో చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది కీర్తి. అలాగే తమిళ్‌లో దర్శకుడు సెల్వరాఘవన్‌తో కలిసి 'సానికాయిదమ్' అనే సినిమా చేస్తోంది. ఈ మూవీలో సెల్వరాఘవన్‌ చెల్లెలిగా నటిస్తోంది కీర్తి. ఆ తర్వాత కమెడియన్ వడివేలు లీడ్‌ రోల్‌ ప్లే చేస్తోన్న 'నాయి శేఖర్ రిటర్న్స్' లో ఒక ప్రధాన పాత్ర పోషించబోతోంది.

హీరోయిన్‌గా కెరీర్‌ మంచి పీక్‌లో ఉన్నప్పుడు సాధారణంగా ఎవరూ చెల్లెలి పాత్రలు చేయరు. అసలు కమెడియన్స్‌ హీరోగా చేస్తోన్న సినిమాలని అస్సలు టచ్ చేయరు. ఇలాంటి సపోర్టింగ్‌ రోల్స్‌ చేస్తే కెరీర్ డ్యామేజ్ అవుతుందని అంతా భయపడుతుంటారు. కానీ కీర్తి సురేశ్ మాత్రం సిస్టర్ రోల్స్‌తో బిజీ అవుతోంది. మరి ఇలాంటి పాత్రలతో ఆమె సినీ భవిష్యత్ ఎలా మలుపు తిరుగుతుందో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: