మిల్కీబ్యూటి తమన్నా కెరీర్ పెద్ద గొప్పగా ఏమీ లేదని తెలుస్తుంది.. మొన్న నితిన్ తో చేసిన అంధాధూన్ రీమేక్ మాస్ట్రో కూడా నటన పరంగా ఆమెకు మార్కులు తెచ్చిపెట్టిందే కానీ సినిమాలు తెచ్చి పెట్టలేకపోయిందని చెప్పవచ్చు..
ఉన్నంతలో రీసెంట్ గా రిలీజైన సీటీమార్ సినిమానే కాస్త ఊపు తెచ్చిందని తెలుస్తుంది. ఆమె "సరిలేరు నీకెవ్వరు" సినిమాలో హీరో మహేశ్బాబుతో స్పెషల్ సాంగ్లో ఆడిపాడిందని అందరికి తెలుసు. దానికన్నా ముందు 2019లో చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'లో ఓ కీలక పాత్రలో మెప్పించింది.. తెలుగులో పెద్దగా సినిమాలు తగ్గించేసిన ఈ భామ ఈ ఏడాది మాత్రం మొత్తం టాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టినట్లు సమాచారం.. ఈ క్రమంలో ఆమె రెమ్యునరేషన్ పెంచేసిందనే వార్త వినిపిస్తుంది.. డిమాండ్ లేకుండా రేటు పెంచటమేంటనేది అందరు ఆశ్చర్య పోతున్నారట అయితే అందుకు ఆమె ఓ స్కీమ్ ఫాలో అవుతోందని తెలుస్తుంది..
అందుతున్న సమాచారం మేరకు రెగ్యులర్ గా తమన్నా కోటిన్నర రెమ్యునేషన్ డిమాండ్ చేస్తోందని సమాచారం. అయితే సీనియర్ హీరోలు అంటే అరవై ఏళ్ళు దాటిన వెంకటేష్, నాగార్జున మరియు చిరంజీవిలతో చేస్తే ఆమెకు ఎక్కువ రెమ్యునేషన్ అడుగుతోందని సమాచారం.. ఎందుకంటే ఆ హీరోలకు పెయిర్ గా ఎవరూ సెట్ అవ్వటం లేదని దాంతో రెండు కోట్లు వరకూ ఆమెకు పే చేస్తున్నట్లు చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలో వెంకటేష్ తో ఎఫ్ 3 మరియు మెహర్ రమేష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న భోళా శంకర్ లో చిరు సరసన ఎక్కువ తీసుకుంటోందని టాక్ వినిపిస్తుంది.
మరో ప్రక్క హీరోయిన్గా ఫేడవుట్ అవుతున్న తరుణంలో సపోర్టింగ్ రోల్స్ చేయడానికి సిద్దపడుతోందని సమాచారం. మాస్ట్రోలో హీరోయిన్ కాకుండా సినిమాకు అతి ముఖ్యమైన పాత్ర చేయటం ద్వారా పరిశ్రమకి తన ఉద్దేశం ఏంటో తమన్నా చెప్పినట్లైందని అంటున్నట్లు సమాచారం.. దీంతో తమన్నాకు మరిన్నిఆఫర్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఆమె సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం', 'ఎఫ్ 3', మరియు 'దటీజ్ మహాలక్ష్మి' సినిమాలు చేస్తోందని సమాచారం. అలాగే హిందీలో 'బోలె చుడియాన్' చిత్రంలోనూ కనిపించనున్నట్లు తెలుస్తుంది.