టాలీవుడ్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'అఖండ'.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన యువ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా గా నటిస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది.మరికొద్ది రోజుల్లోనే విడుదల కానున్న ఈ సినిమా నైజాం హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'అఖండ' నైజాం హక్కులను సొంతం చేసుకున్నారు.ఈ సినిమా నైజాం హక్కుల కోసం దిల్ రాజు ఏకంగా 19 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది.

దీంతో సినిమాపై అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్లు భారీ రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒక పాత్ర అఘోరా కాగా.. మరొకటి ఫ్యాక్షనిస్ట్ అని సమాచారం.ఇక ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ మెయిన్ విలన్ గా కనిపించనుండగా.. పూర్ణ మరో కీలక పాత్రలో నటిస్తోంది.ఇక సింహా, లెజెండ్ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో నందమూరి అభిమానులు ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు.

ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.దీపావళి కానుకగా నవంబర్ 4 న ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా అనంతరం క్రాక్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తన 107 వ సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రావడం జరిగింది.అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మరోసారి బాలయ్య రెండు పాత్రల్లో అదరగొట్టనున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: