ఇండియా - పాకిస్తాన్ ల జరిగిన టి-20 క్రికెట్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడాన్ని 130 కోట్ల భారతీయలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. ఆ మ్యాచ్ జరిగి రెండు రోజులు అయిపోయిన ఇంకా ఆ షాక్ నుండి భారతీయులు తేరుకోలేక పోతున్నారు. మొన్న ఆదివారం ఇండియా మొత్తం ఒక జాతీయ పండుగలా ఇండియా విజయాన్ని సెలెబ్రెట్ చేసుకోవాలని ఎవరికి వారు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు.  



వందల కోట్ల బెట్టింగ్ ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఫలితంతో ఎంతోమంది నష్టపోయారు. ఇలాంటి పరిస్థితులలో ఈ ఓటమికి నాగబాబు పరోక్షంగా కారణం అంటూ నిన్న సోషల్ మీడియాలో కొందరు చేసిన ట్రోలింగ్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి కారణం ఈ మ్యాచ్ చూడటానికి నాగబాబు ప్రత్యేకంగా దుబాయ్ వెళ్ళడమే కాకుండా అక్కడ అతడు ఆ మ్యాచ్ ని చూస్తున్న ఫోటో సోషల్ మీడియాకు లీక్ అయింది.


ఇప్పుడు ఆ ఫోటోను చూసినవారు నాగబాబు అక్కడకు వెళ్ళడం వల్లనే ఇండియా ఓడిపోయింది అంటూ సెటైర్లు వేసారు. దీనికి కారణం ఈమధ్య జరిగిన మా ఎన్నికలలో నాగబాబు సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓడిపోతే కొంతకాలం క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో నాగబాబు సపోర్ట్ చేసిన ‘జనసేన’ ఓడిపోయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ నాగబాబు ఎవర్నైనా సపోర్ట్ చేస్తే వారు ఓడిపోయే ప్రమాదం ఉంది అంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసారు.



వాస్తవానికి అందరిలానే ఇండియా గెలుపును దగ్గర ఉండి చూసి ఆనంద పడాలని నాగబాబు ఖర్చు పెట్టుకుని దుబాయ్ వెళ్ళి ఉంటాడు. స్వతహాగా దేశభక్తి ఎక్కువగా ఉండే నాగబాబు ప్రయత్నంలో నెగిటివ్ కోణం వెతికి అతడి వ్యతిరేకులు సెటైర్లు వేయడం చూసిన వారికి నవ్వు తెప్పించే సందర్భం. పాకిస్తాన్ లో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన భారత్ ఈ టోర్నమెంట్ లో ఫైనల్స్ దాకా వెళ్ళాలి అంటే జరగబోయే ప్రతి మ్యాచ్ లోను గెలిచి తీరవలసిన పరిస్థితి..








మరింత సమాచారం తెలుసుకోండి: