తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేని పేరు ఏదైనా ఉందంటే అది ఉదయ్ కిరణ్ అని చెప్పవచ్చు.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సంచలనాలు సృష్టించిన హీరో అని అందరికి తెలుసు.

ఒకటి రెండు కాదు వరసగా మూడు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకని చాలా మంది స్టార్ హీరోల కంటే ఎక్కువ మార్కెట్ సంపాదించుకున్నాడట ఉదయ్ కిరణ్. అయితే ఒకానొక సమయంలో జరిగిన చిన్న సంఘటన కారణంగా ఆయన కెరీర్ పూర్తిగా తలకిందులు అయిపోయిందని సమాచారం.. అప్పటి నుంచి అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడట.ఇక చనిపోయే వరకు కూడా కోలుకోలేకపోయాడని తెలుస్తుంది.ఆర్ధిక ఇబ్బందులు మరియు వ్యక్తిగత పరిస్థితుల కారణంగా జనవరి 5, 2014న ఉదయ్ కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది.. తాజాగా ఈయన రాసిన ఎమోషనల్ లెటర్ ఒకటి బయటకు వచ్చిందట. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని సమాచారం.

 
అది కూడా ఉదయ్ కిరణ్‌ రాతలోనే.. ‘విషితా మా అమ్మ అంటే ఎంత ఇష్టమో ఆ తర్వాత అంతటి స్థాయిలో నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు అయితే మన మధ్య గొడవల కారణంగా అంకుల్ మరియు ఆంటీ చాలా బాధ పడుతున్నారట వారికి ఈ బాధ ఉండకూడదు నువ్వు అతడు మంచి వాడు అని నమ్ముతున్నావు కానీ అతడు మంచివాడు అస్సలు కాదు నా మాట విను నువ్వు నిజం తెలుసుకునే రోజు నీ పక్కన ఉదయ్ ఉండడని తెలుసుకో.నువ్వు ఒకసారి అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకో నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురవుతూ వచ్చాయి. నన్ను ఓ మ్యాడ్‌ ఫెలోగా చిత్రీకరించి ఆడుకుంది. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధ పడుతున్నారు అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అని అనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మా నిన్ను ఓ సారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా’ అని ఉందట. ఈ లేఖను చదివిన ఉదయ్ అభిమానులంతా ఆయనను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: