సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మరణించారు. గత వారం రోజులుగా న్యుమోనియాతో ఇబ్బంది పడుతున్న సిరివెన్నెల కిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. చివరికి ఊపిరితిత్తుల కాన్సర్ లక్షణాలతో మరణించినట్లు డాక్టర్స్ ధ్రువీకరించారు. ఈ వార్త విన్న తెలుగు సినిమా ప్రపంచం దుఃఖంలో మునిగిపోయింది. సిరివెన్నెల కలం నుండి వచ్చిన ప్రతి పాట ప్రేక్షకుల అభిమానాన్ని పొందగలిగింది. ఈ చెడు వార్తను విన్న ప్రజలు సిరివెన్నెల జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ఆయన రచించిన పాటలను గుర్తు చేసుకుంటూ తమ మనసులో సిరివెన్నెల ఘనమైన వీడ్కోలు ఇస్తున్నారు.

ఒకప్పుడు మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు అన్నం తింకూండా మారం చేస్తే వారిచేత అన్నం తినిపించాడు ప్రతి ఒక్క తల్లి పాడే పాట, "చందమామ రావే జాబిల్లి రావే.. కొండెక్కి రావే..గోగుపూలు తేవే...". ఈ పాట గురించి తెలియని తెలుగు వారు ఉంటారంటే అతిశయోక్తికాదు. అంతగా ఈ పాట ప్రతి ఇంటి తల్లి గొంతులో నానుతూ ఉంది. ఈ పాటలో ప్రతి ఒక్క పదం అర్థవంతంగా ఉంటుంది. చాలా మంది తల్లులకు ఈ పాట ఎవరు రాశారు? ఎవరు స్వర పరిచారు? ఎవరు పాడారు? అన్న విషయాలు తెలిసి ఉండకపోవచ్చు.  

ఈ పాట కె విశ్వనాధ్ దర్శకత్వం వహించిన 'సిరివెన్నెల' మూవీ లోనిది. ఈ పాటను సందర్భానికి తగినట్లుగా ఎంతో అద్భుతంగా రాశారు. అంత మంచి పాటకు మధురమయిన బాణీలు సమకూర్చి సుమధురంగా తీర్చిదిద్దారు సంగీత దర్శకుడు కెవి మహదేవన్. ఈ పాటను అంతకు మించిన నైపుణ్యంతో ఎస్పీ బాలసుబ్రమణ్యం మరియు పి సుశీల ఆలపించారు. ఈ రోజు ఈయన చనిపోయాడు అనే మాట వింటుంటే ఎవ్వరికీ నమ్మబుద్ది కావడం లేదు. ఈ పాట లోని కమ్మదనం, అమ్మతనం ఆయన రాసిన పాట రూపంలో చూశాము. కానీ ఇక ఎప్పటికీ ఆయనను చూడలేము.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: