ప్రస్తుతం బుల్లితెరపై బిగ్గెస్ట్ సినీ రియాలిటీ షో బిగ్బాస్ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట హిందీ లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ తర్వాత అన్ని భాషలలో కూడా ప్రసారం అవుతూ ఉంది. బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించి టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది. అయితే గత కొన్ని సీజన్ల నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్ జెండర్లను కూడా కంటెస్టెంట్ గా పంపిస్తూ ఉండటం గమనార్హం. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి గుర్తింపు తీసుకు రావాలి అనే ఉద్దేశంతో  నిర్వాహకులు గొప్ప ఆలోచన చేశారు.


ఈ క్రమంలోనే గత రెండు సీజన్ల నుంచి తెలుగు బిగ్ బాస్ లో కూడా ట్రాన్స్ జెండర్  లను పంపిస్తూ ఉండటం గమనార్హం. ఇక గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చింది తమన్నా సింహాద్రి. తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది. ముఖ్యంగా హౌస్ లో రవి కృష్ణ తో గొడవలు పెట్టుకుని బాగా ఫేమస్ అయిపోయింది తమన్నా సింహాద్రి. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎంతో క్రేజ్ సంపాదించింది. కానీ ఎందుకో కేవలం మూడు వారాలకే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేస్తుంది.


 ఇక ఇటీవలే బిగ్ బాస్ 5వ సీజన్ లో ప్రియాంక సింగ్ ట్రాన్సజెండర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఎంతో హుందాగా నడుచుకుంటూ ట్రాన్స్జెండర్స్ పై అందరికీ గౌరవాన్ని పెంచుతుంది ప్రియాంక సింగ్. అంతే కాదు ఇక ప్రస్తుతం ఏకంగా టాప్ సెవెన్ లోకి కూడా రావడం గమనార్హం. ఇకపోతే ఇటీవలే సోషల్ మీడియా వేదికగా స్పందించిన తమన్నా సింహాద్రి తాను ప్రియాంక సింగ్ కి సపోర్ట్ చేస్తున్నాను అని తెలిపింది. ట్రాన్స్జెండర్ అనగానే చాలామంది రోడ్ల మీద అడుక్కునే వారే గుర్తిస్తారని కానీ అయిన వాళ్ళు అందరికీ దూరమై ఎన్నో కష్టాలు పడి చాలా మంది గౌరవంగా బతకాలని ముందుకు వస్తున్నారని వాళ్ళలో ప్రియాంక సింగ్ కూడా ఒకరు అంటూ తెలిపింది. ప్రియాంక బిగ్ బాస్ లో ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుండటం సంతోషంగా ఉందని ఆమెకు తాను సపోర్ట్ చేస్తాను అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: