ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన. చలో సినిమాతో తెలుగు తెరపై ఆరంగేట్రం చేసిన ఈ భామ..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు ఈమె నటించిన మెజారిటీ సినిమాలు భారీ సక్సెస్ను అందుకున్నాయి. దీంతో రష్మిక క్రేజ్ కాస్త పెరిగిపోయింది. ప్రస్తుతం సౌత్ ఇండియా లోనే టాప్ స్టార్స్ లో ఒకరిగా వెలుగొందుతోంది రష్మిక. ఇక ప్రస్తుతం తెలుగులో పుష్ప, ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో పుష్ప పార్ట్ వన్ ఈనెల 17న విడుదల కానుంది.

ఇక ఈ సినిమాలో రష్మిక డీ గ్లామరస్ పాత్రలో నటిస్తోంది. అయితే రష్మిక ఈ స్థాయికి చేరుకోవడం వెనక ఆమె కష్టం కూడా భారీగానే ఉందని రష్మిక సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్తో ఈమె నటిస్తున్న పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర కోసం రష్మిక ఎక్స్ ప్రెషన్స్ తో పాటు మేనరిజమ్స్ ని కూడా ప్రాక్టీస్ చేసిందట. ఇక చిత్తూరు యాసని నేర్చుకోవడానికి రష్మిక చాలా కష్టపడిందట. రష్మిక తిరుపతి వెళ్ళిన సమయంలో అక్కడి కల్చర్ వారి జీవన విధానం మరియు ఇతర విషయాల గురించి తెలుసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కష్టం వల్లే పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రకు రష్మిక పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

ఇక ఇక సినిమాలో తాను చేస్తున్న శ్రీవల్లి పాత్రతో పుష్ప సినిమాపై అంచనాలు పెంచేసింది రష్మిక. చలో, గీతగోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకున్న రష్మికకు ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ప్రశంసలు దక్కడం విశేషం. బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి మిషన్ మజ్ను అనే సినిమాలో నటిస్తోంది రష్మిక. ఈ నేపథ్యంలోనే రష్మిక చాలా క్రమశిక్షణతో ఉంటారని, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అని మిస్టర్ మజ్ను టీం అంటోంది. మరోవైపు హీరో సిద్ధార్థ్ మల్హోత్రా వర్క్ కమిట్ మెంట్ విషయంలో రష్మిక సూపర్ అని చెప్పుకొచ్చాడు. దీంతో ముందు ముందు బాలీవుడ్లో కూడా రష్మికా స్టార్ ఇమేజ్ను అందుకునే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: