నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో టెలికాస్ట్ అవుతున్న ఆన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ఇప్పటికే ఈ టాక్ షో ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది. ఈ టాక్ షో  మొదటి ఎపిసోడ్ గెస్ట్ లుగా మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి లు వచ్చారు, ఆ తర్వాత రెండవ ఎపిసోడ్ కు గెస్ట్ గా నాచురల్ స్టార్ వచ్చాడు. ఇలా ఈ రెండు ఎపిసోడ్ లతో షో ను ఫుల్ సక్సెస్ చేసిన బాలకృష్ణ ఆ తర్వాత చేతికి చిన్న సర్జరీ కావడంతో ఈ టాక్  షో కొంత కాలం పాటు దూరం అయ్యారు,  ఆ తర్వాత మూడవ ఎపిసోడ్ తాజాగా ఈ మధ్య నే ప్రసారం అయింది. ఈ మూడో ఎపిసోడ్ లో భాగం గా తెలుగు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం, తెలుగు ప్రముఖ కామెడీ దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చారు.

 ఈ మూడవ ఎపిసోడ్ కు  కూడా బాలకృష్ణ అదిరిపోయే రేంజ్ లో హోస్ట్ గా వ్యవహరించి విజయవంతం చేశాడు, అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆన్ స్టాపబుల్ టాక్ షో కు నాలుగవ గిఫ్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే ఇందుకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఒకవేళ ఈ వార్త కనుక నిజమే అయితే బాలకృష్ణ అభిమానులకు మహేష్ బాబు అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ఎందు కంటే ఇద్దరు తెలుగు స్టార్ హీరో లు ఒకే వేదిక పై కనబడడం అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోల అభిమాను లకు పండగ వాతా వరణం అలాంటి ది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: