ఇప్పుడున్న టాప్ హీరోయిన్ల పారితోషకాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోలతో సమానంగా తీసుకుంటూ స్టార్ హీరోలకు మేం ఏం తీసిపోం అంటున్నారు. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న నయనతార, సమంత, పూజా హెగ్డే, రష్మిక, తమన్నా, కీర్తి సురేష్..ఇలా అందరు 3 కోట్ల నుండి 6 కోట్ల వరకు పారితోషకంగా పుచ్చుకుంటున్నారు. వీళ్లల్లో నయనతారానే టాప్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. నయన్ ఒక్కో సినిమాకి 6 కోట్ల నుండి 8 కోట్లు వరకు అందుకుంటున్నాట్లు సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఇలా కోట్లు తీసుకుంటున్న హీరోయిన్ల రెమ్యూనరేషన్ ముందు సాయి పల్లవి పారితోషకం చాలా చిన్నదిగా కనిపిస్తుంది.  గ్లామరస్ పాత్రలే కాకుండా..తన పాత్రకు కూడా సినిమాలో విలువ ఉన్న స్టోరీలనే చూస్ చేసుకుంటూ వస్తుంది ఈ అమ్మడు. సాయి పల్లవి సినిమాలు చూస్ చేసుకునే విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందంటే.. సినిమా లో ఆమె పాత్రకు విలువ లేదని..కేవలం గ్లామర్ కోసమే తన పాత్ర అక్కడ పెట్టారని..ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాకే నో చెప్పిందట. అంతేనా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్ వస్తే స్టోరీ నచ్చక వెంటనే రిజెక్ట్ చేసింది. దీని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు సాయి పల్లవి స్టోరీ విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో. రీసెంట్ గా సాయి పల్లవి హీరోయిన్ గా నాగచైతన్య తో నటించిన "లవ్ స్టోరీ" సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇక సాయి పల్లవి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. మొదట్లో 30 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్న ఈ బ్యూటీ ఫిదా సినిమాకి 50 లక్షలు తీసుకుందట. ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా కే ఆమె ఇప్పటి వరకు అత్యధిక పారితోషకం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా కి ఫస్ట్ టైం అమ్మడు తన కెరీర్ లోనే కోటీ 25 లక్షలు రెమ్యూనరేషన్ గా అందుకుందట. మిగతా హీరోయిన్ల తో పోల్చుకుంటే సాయి పల్లవి రెమ్యూనరేషన్ తక్కువనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: