బాలయ్య, బోయపాటిల హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కి వారి కాంబోలో మరొక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లేటెస్ట్ సినిమా అఖండ. బాలయ్య అఘోరాగా, రైతుగా రెండు రకాల విభిన్న పాత్రల్లో నటించిన ఈ సినిమాలో యువ భామ ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఈ మూవీని ద్వారా క్రియేషన్ పై నిర్మించారు.

మంచి యాక్షన్ తో పాటు ఎమోషనల్, కమర్షియల్ హంగుల కలబోతగా బోయపాటి శ్రీను తీసిన ఈ సినిమాకి నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ సైతం బ్రహ్మరథం పట్టారు. విడుదలైన అనేక కేంద్రాల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న అఖండ ఇటీవల 103 కేంద్రాల్లో విజయవంతంగా అర్ధ శతదినోత్సవం జరుపుకుంది. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్, బీజీఎమ్ కి కూడా ఎంతో పేరు వచ్చింది. అయితే అసలు మ్యాటర్లోకి వెళితే, వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మొదటగా సాయేషా సైగల్ ని వరించింది. వాస్తవానికి నవంబర్ 2020 లో ఆమెని నటిగా ఎంపిక చేసినట్లు అఖండ యూనిట్ అధికారికంగా ప్రకటించింది కూడా.

అయితే షూటింగ్ ఆరంభానికి ముందు కొద్దిపాటి పర్సనల్ ఇబ్బందుల వలన చివరి నిమిషంలో సినిమా నుండి ఆమె తప్పుకోవడంతో, అనంతరం పలువురు ఇతర హీరోయిన్స్ ని పరిశీలించిన బోయపాటి, ఫైనల్ గా ప్రగ్యని హీరోయిన్ గా ఎంపిక చేసారు. తరువాత షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం రిలీజ్ అయి అద్భుత విజయం సొంతం చేసుకున్న అఖండ మూవీలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు సాయేషా ఒకింత ఫీల్ అవుతున్నారట. తనకు ఎంతో ఇష్టమైన బాలయ్య, బోయపాటి కాంబో సినిమాని మిస్ అయ్యాయని, మరొకసారి ఛాన్స్ వస్తే తప్పకుండా యాక్ట్ చేస్తానని తన సన్నిహితులకు చెప్పారట. అయితే మరి రాబోయే రోజుల్లో అయినా ఆమెకు బాలయ్యతో నటించే ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: