ఇటీవలి కాలంలో బుల్లితెర కార్యక్రమాలు ఎన్నో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈటీవీలో కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా కార్యక్రమం కూడా ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ పెంచుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి వారం ఒక సినీ సెలబ్రిటీలను గెస్ట్ లుగా పిలుస్తారు. ఇక తమ సినీ కెరియర్ కు   సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చిన ఎంతోమంది నటీనటులు తన కెరియర్, నిజ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడం చేస్తుంటారు.


 అయితే వచ్చేవారం ఎపిసోడ్లో ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి క్యారెక్టర్ ఆర్టిస్టు సంపత్ రాజ్  వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు సంపత్ రాజు. ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్మెంట్ పంచే పాత్రల్లోనే కాదు అందరిని  భయపెట్టే విలన్ పాత్రల్లో కూడా నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చిన సంపత్ రాజు తన కెరియర్ కు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. సినిమాల్లోకి వెళ్తాను అని మా అమ్మకు చెప్పినప్పుడు ఎలాంటి పని పాట లేని వాడు సినిమాలో కి వెళ్తాడు అని చెప్పింది. ఇక అమ్మ మాటలు విన్నావంటే సినిమాల్లోకి వెళ్లలేవు ఇంటి నుంచి పారిపో అంటూ ఆ సమయంలో మా నాన్న సలహా ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు సంపత్ రాజు.


 అదే సమయంలో నువ్వు ఎవరో డైరెక్టర్ కు కెమెరా ఎత్తుకుపోతా అవకాశం ఇవ్వకపోతే అని వార్నింగ్ ఇచ్చావట కదా అవునా అంటూ వ్యాఖ్యాత అలీ ప్రశ్నించాడు. అవును దర్శకుడు త్రివిక్రమ్ గారికి వార్నింగ్ ఇచ్చాను అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు సంపత్ రాజు. మీ తదుపరి సినిమాలో అవకాశం ఇవ్వకపోతే లొకేషన్ కి వచ్చి మరి కెమెరా ఎత్తుకుపోతా అంటూ ఫోన్ చేసి బెదిరించా..  ఇక త్రివిక్రమ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అన్న విషయాన్ని సునీల్  చెప్పారని గుర్తుచేసుకున్నాడు సంపత్ రాజ్. ఇక త్రివిక్రమ్ తన సినిమాలో అవకాశం ఇవ్వకపోతే నిజంగానే అలా చేస్తాను. ఇక వినే పరిస్థితి లేదు అంటూ సంపత్ రాజ్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Etv