నటసింహ నందమూరి బాలకృష్ణ ఇటీవల ఆహా ఓటీటీ 'అన్ స్టాపబుల్' అనే టాక్ షో తో హోస్ట్ గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీజన్ 1 లో చాలామంది అగ్రతారలు బాలయ్య షో లో సందడి చేశారు. అయితే ఈ షో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తే బాగుంటుందని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.అన్ స్టాపబుల్ సీజన్ 1 ముగిసిన నేపథ్యంలో కనీసం అన్ స్టాపబుల్ సీజన్ 2 లో అయినా ఈ కాంబినేషన్ సెట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక అన్ స్టాపబుల్ సీజన్ 1 ఎవరు ఊహించని స్థాయిలో సక్సెస్ అవడంతో ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెల నుంచి అన్ స్టాపబుల్ సీజన్ 2 ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఈ షో కోసం పనిచేసిన బి.వి.ఎస్.రవి అన్ స్టాపబుల్ టాక్ షోకి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తమ సినిమా షూటింగ్లతో బిజీగా ఉండడంతో ఈ షో కి హాజరు కాలేదని చెప్పిన బి.వి.ఎస్.రవి.. నాగార్జునను ఇంకా ఈ టాక్ షో కోసం సంప్రదించలేదని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత కావడం.. అదేవిధంగా బాలయ్య తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ ఇద్దరు ఒకే వేదికపై కనిపిస్తే ఈ ఇద్దరు హీరోల దారులు వేరు కావడం వల్ల జోరుగా చర్చ జరుగుతుంది.

అందువల్లనే పవన్ కళ్యాణ్ ని ఈ షో కొరకు సంప్రదించలేదని తాజాగా బి.వి.ఎస్.రవి వెల్లడించారు. అయితే మెగా హీరోలు ఈ టాక్ షో కి రాకపోవడానికి షూటింగ్లతో బిజీగా ఉండడమే కారణమని ఇతర కారణాలు ఏవీ లేవని వెల్లడించాడు బి.వి.ఎస్.రవి. ఇక ఇప్పటి వరకు సీజన్ వన్ లో పాల్గొన్న గెస్ట్ లు అందరూ సంతృప్తిని వ్యక్తం చేశారని అన్నారు. బాలయ్య గారి పై ఉండే ఇష్టం, గౌరవం వల్ల రాజమౌళి లాంటి ఒక అగ్ర దర్శకుడు ఈ షో కి వచ్చారని.. ఇక బాలయ్య ఈ షోకు హోస్ట్ గా చేయడం వల్ల ఆహా ఓటీటీ కి భారీ సబ్స్క్రిప్షన్ లు పెరిగాయని బీవీఎస్ రవి వెల్లడించాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: