బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జూహీ చావ్లా నోటిదురుసుకు కోర్టు గట్టిగానే షాకిచ్చింది. ఆమె గతంలో 5జీ నెట్ వర్క్ పై వివాదాస్పద కామెంట్స్ చేసింది.ఇక దీనిపై కేసులు నమోదై ఆమె కోర్టుకెక్కింది.ఇక ఈ కేసు గురువారం ఓ కొలిక్కి వచ్చింది.దేశంలో ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా 5జీ వైర్ లెస్ నెట్ వర్క్ లను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్ జూహీ చావ్లా.. పర్యావరణ వేత్తలతో కలిసి గత సంవత్సరం ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసింది.ఇక దీనిపై పలు సార్లు విచారించిన ధర్మాసనం.. జూహీ చావ్లా పై కోపం వ్యక్తం చేసింది.5జీ నెట్ వర్క్ తో ప్రజలు జంతువులకు ముప్పు ఉందంటూ జూహీ చావ్లా చేసే ప్రచారం కేవలం పబ్లిసిటీ కోసమేనంటూ కోర్టు పేర్కొంది. ఇక అంతేకాకుండా ఆమెపై 20 లక్షల జరిమానా కూడా విధించిన విషయం తెలిసిందే. జరిమానా తగ్గించాలన్న వినతిపై కూడా కోర్టు స్పందించింది. ఏదైనా కాని ప్రజా ప్రయోజనం కోసం పనిచేస్తే కోర్టుకు కట్టాల్సిన జరిమానాను రూ.20 లక్షల నుంచి రూ.2 లక్షలకు తగ్గిస్తామని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొనడం జరిగింది.

ఇక ఈ క్రమంలోనే జూహీ చావ్లా ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తో కలిసి పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది.సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి సాధికారత కల్పించే కార్యక్రమాలలో నటిస్తానని గురువారం ధర్మాసనానికి ఆమె తెలిపింది. దీంతో ప్రచారం కోసం దావా వేసినట్లు నటి జూహీ చావ్లాపై కోర్టు చేసిన కామెంట్స్ ని ఢిల్లీ హైకోర్టు తొలగించింది.బాలీవుడ్ నటి జూహీ చావ్లా ప్రజా ప్రయోజనం కోసం పనిచేస్తానని కోర్టుకు తెలుపడంతో ధర్మాసనం జూహీ చావ్లాపై విధించిన జరిమాన రూ.20లక్షల నుంచి రూ.2 లక్షలకు తగ్గించడం జరిగింది. ఆమె 5జీ నెట్ వర్క్ సమస్యను సాధారణంగా అర్థం చేసుకోలేదని కోర్టు అభిప్రాయపడటం జరిగింది. ఇక సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ సూచనలను తీసుకున్న తర్వాత జూహీ చావ్లా ఈ డెసిషన్ తీసుకుంది.ఇక కోర్టు జరిమానా శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రజా సేవ చేయాల్సిన పరిస్థితి పాపం జూహీ చావ్లాకు వచ్చిందని లేకుంటే అసలు ఆమె ప్రజా సేవే చేసేది కాదన్న గుసగుసలు బాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: