పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు,  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మామూలు జనం తో పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సైతం ఎంతో మంది అభిమానులు ఉన్నారు, కేవలం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు మాత్రమే కాకుండా చాలా మంది అభిమానులే ఉన్నారు,  ఇప్పటికి ఎంతో మంది సినీ ప్రముఖులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని ఎన్నో సార్లు బయటకు చెప్పారు,  అయితే ఇలా ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వీరాభిమాని అన్న విషయం మన అందరికీ తెలిసిందే,  ఎన్నోసార్లు నితిన్,  పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా,  మీడియా వేదికగా,  ఎన్నో ఫంక్షన్ లాలి కూడా తెలియజేశాడు,  ఇదిలా ఉంటే తాజాగా మరో సారి పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని నితిన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. 

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే,  ఈ సినిమా విడుదల అయిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.  అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడంతో మహేష్ బాబు లాంటి స్టార్ హీరో కూడా ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు,  ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంది అంటూ మహేష్ బాబు ప్రశంసించాడు.  అయితే తాజాగా నితిన్ కూడా సోషల్ మీడియా వేదికగా భీమ్లా నాయక్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు,  సోషల్ మీడియా వేదికగా నితిన్ ఇది కదా మాకు కావలసింది,  పవన్ కళ్యాణ్ విధ్వంసం సృష్టించాడు.  రానా సినిమాలో  అదర గొట్టావ్, తమన్ సంగీతం లో ఫైర్ ఉంది, త్రివిక్రమ్ శ్రీనివాస్,  సాగర్ చంద్ర కు కృతజ్ఞతలు అంటూ భీమ్లా నాయక్ చిత్ర యూనిట్  కు నితిన్ సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: