ఇండియాలో ఉన్న టాప్ దర్శకుల్లో శంకర్ ఒకరు అనే విషయం మనందరికీ తెలిసిందే.  జెంటిల్ మెన్ ,  ప్రేమికుడు , జీన్స్ , ఒకే ఒక్కడు , భారతీయుడు ,  అపరిచితుడు ,  రోబో , శివాజీ , ఐ ,  రోబో 2.0 వంటి సినిమా లతో ఇండియా లోనే టాప్ దర్శకుల్లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకున్న శంకర్ కొంత కాలం క్రితం కమల్ హాసన్ హీరోగా భారతీయుడు  మూవీ కి సీక్వెల్ గా భారతీయుడు 2 మూవీ ని మొదలు పెట్టాడు.  కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత నిలిచిపోయింది.  

అలా కొన్ని అనివార్య కారణాల వల్ల భారతీయుడు 2 సినిమా చాలా కాలం పాటు నిలిచిపోవడంతో చివరికి శంకర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  హీరోగా ఒక మూవీ ని మొదలు పెట్టాడు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.  ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది.  ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే శంకర్ , రామ్ చరణ్ సినిమా పూర్తి అయిన  కూడా మరో తెలుగు హీరో తోనే సినిమా చేయనున్నట్లు గత కొంత కాలంగా కొన్ని వార్తలు బయటకు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.  అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఇండియా లోనే ఫుల్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా పూర్తి అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.  మరి ఈ వార్తపై  ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: