టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని బాగా అలరించారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు.ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అయింది. దీంతో పాటు ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేయగా..ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్ కి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. డార్క్ థీమ్ తో ఈ పోస్టర్ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త కూడా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. ఇక అదేంటంటే.. ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా నటించబోతున్నారట. ఇటీవల ప్రశాంత్ నీల్.. కమల్ హాసన్ కి కథ వినిపించినట్లు సమాచారం తెలుస్తోంది. 


ఇందులో కమల్ హాసన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తారని సమాచారం. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోలను ఇంకా విలన్స్ ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తారు.అందుకే కమల్ హాసన్ కూడా ఈ సినిమాని ఒప్పుకున్నట్లు టాక్. మరి దీనిపై ఎంతవరకు నిజముందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇక చిత్రబృందం ఈ వార్తలపై స్పందిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఇంకా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు. ఈ సినిమా 'కేజీఎఫ్' సినిమా రేంజ్ లో ఉంటుందని 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పారు. దీంతో అంచనాలు అయితే ఇక మరింత పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: