మిమి చిత్రంలో కృతి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు పొందుతున్నది. తాజాగా ప్రకటించిన ఐఫా-2022 లో ఫంక్షన్లో ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్న ది. ఈ అవార్డు అందుకున్న నేపథ్యంలో తన సంతోషాన్ని అభిమానులతో పంచుకొని.. అవార్డు అందుకున్న తర్వాత మాట్లాడడం జరిగింది.మిమి చిత్రం తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది అని ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు తనతో నటించిన నటులకు కూడా గెలిపించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేసింది మొదటిసారి ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అని తెలుపు కొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఇక కృతి సనన్ నటిస్తున్న ప్రస్తుత సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తున్నది ఇక ఈ చిత్రం గురించి కూడా మాట్లాడుతూ ప్రభాస్ తో నటిస్తున్న ఈ సినిమా తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని తెలియజేసింది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఈమె సీత పాత్రలో నటిస్తున్నది ఈ సినిమాతో బాలీవుడ్లో కూడా పలు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంటోంది. ఇక ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ తో నటిస్తున్న ఈ సినిమాపై కృతిసనన్ మాట్లాడడంతో కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి