ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించగా,  రావు రమేష్బ్, సునీల్ , అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాకు సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు  ఈ సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి. పుష్ప పార్ట్ 1 సినిమా విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు కూడా కీలక పాత్ర ను పోషించాయి. ఇది ఇలా ఉంటే పుష్ప పార్ట్ 1 సినిమా షూటింగ్ దాదాపుగా అంతా కూడా మారేడుమిల్లి ,  రంపచోడవరం అడవుల లోనే చిత్రీకరించారు. అడవుల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ఈ మూవీ కే హైలెట్ గా నిలిచాయి. మొదట పుష్ప పార్ట్ 1  సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఫారిన్ లో చిత్రీకరించాలి అని చిత్ర బృందం అనుకున్నప్పటికీ కారోనా వల్ల అది వీలు కాలేదు. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.

పుష్ప పార్ట్ 2 షూటింగ్ ను  మాత్రం ఇండొనేషియా .. సింగపూర్ లలో చిత్రీకరించడానికి చిత్ర బృందం రేడీ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను 400 వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 మూవీ భారీ విజయాన్ని సాధించడంతో సినీ ప్రేమికులు పుష్ప పార్ట్ 2 మూవీ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: