నేషనల్ క్రష్ రష్మీక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ కన్నడ , తెలుగు , తమిళ   భాషా సినిమాలలో నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.  అలాగే కొంత కాలం క్రితం విడుదల అయిన పాన్ ఇండియా మూవీ పుష్ప తో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా రష్మిక మందన అనేక భారీ ప్రాజెక్ట్ లలో  నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో రష్మిక మందన , సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో పాటు అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న మరొక మూవీ లో కూడా రష్మిక మందన ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ తో పాటు  సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యానిమల్ మూవీ లో కూడా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు ఆయన తలపతి విజయ్ ప్రధాన పాత్రలో వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న వారసుడు మూవీ లో కూడా రష్మిక మందన , విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

మూవీ తో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీతా రామం మూవీ లో కూడా రష్మిక మందన ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ లతో పాటు పుష్ప ది రూల్ మూవీ లో కూడా రష్మిక మందన నటించబోతోంది. ఇలా ప్రస్తుతం రష్మిక మందన అనేక భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: