ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ఖచ్చితంగా తమిళ భారీ బడ్జెట్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ ఒకటి. సౌత్ ఇండియా లెజెండరీ డైరెక్టర్ అయిన మణిరత్నం రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో చాలా భారీగా అంచనాలున్నాయి.బాహుబలి సిరీస్ ని టార్గెట్ గా చేసుకోని దర్శకుడు ఈ సినిమాని చాలా జాగ్రత్తగా ఆసక్తికరంగా బాగా రిచ్ గా తెరకెక్కిస్తున్నాడు.ఇక ప్రేమకథా చిత్రాలకే మణిరత్నం టేకింగ్‌ గాని ఇంకా అలాగే డీటేయిలింగ్ గాని అసలు ఒక రేంజ్‌లో ఉంటుంది. అలాంటిది ఈ సారి ఏకంగా పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నాడంటే ఇంకా ఏ స్థాయిలో తన టేకింగ్ ఉండనుందో అని ప్రేక్షకులు చాలా తీవ్ర ఆసక్తితో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ఇంకా అలాగే టీజర్ ప్రేక్షకులలో ఎన్నో భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. ఇక ఇదిలా ఉంటే మేకర్స్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ చిత్రంలోని ఫస్ట్‌సింగిల్ విడుదల తేదీను చిత్రయూనిట్ తాజాగా ప్రకటించడం జరిగింది.


‘పొంగే నది’ అంటూ సాగే ఈ పాటను జూలై 31 వ తేదీ సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.ఇటీవలే ఈ పాట రికార్డింగ్ మేకింగ్ వీడియోను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష ఇంకా బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మొత్తం రెండు పార్టులుగా తెరకెక్కనుంది. మొదటి భాగం సెప్టెంబర్ నెల 30 వ తేదీ న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ ఇంకా మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.ఈ సినిమాకి మ్యూజిక్ మాంత్రికుడు ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద హిట్ అవ్వడం ఖాయమట. చూడాలి ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: