సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. పూజ హెగ్డేమూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మరొక హీరోయిన్ గా శ్రీ లీల ను తీసుకునే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా , సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లో ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ ను పెట్టే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ ను చేయించే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ మిల్కీ బ్యూటీ తమన్నా తో ఈ మూవీ లో ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తమన్నా అనేక మూవీ లలో ఐటమ్ సాంగ్ లలో నటించింది. అలాగే తమన్నా నటించిన ఐటమ్ సాంగ్ లలో చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఒక వేళ ఈ మూవీ లో కూడా తమన్నా తో ఐటమ్ సాంగ్ ను పెట్టినట్లు అయితే ఈ సినిమాకు మరింత క్రేజ్ లభించే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉంటే తమన్నా ఇప్పటికే అల్లుడు శీను , స్పీడున్నోడు , జై లవకుశ  వంటి తెలుగు సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో నటించి తన అందచందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించింది. అలాగే కే జి ఎఫ్ లాంటి పాన్ ఇండియా మూ వీలో కూడా తమన్నా ఐటమ్ సాంగ్ లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: