గత కొంతకాలంగా సినీ హీరోయిన్లందరూ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత నుండి మొదలుకొని కల్పికా గణేష్ మమతా మోహన్దాస్ ఇలా చాలామంది సినీ సెలబ్రిటీలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని తమ అభిమానులతో పంచుకుంటూ చాలా బాధపడుతున్నారు. అయితే తాజాగా రష్మిక మందన కూడా అలాంటి ఒక సమస్యతో బాధపడుతుంది అనే కొత్త వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా వార్తలు రావడానికి ఒక కారణం కూడా ఉంది. 

సాధారణంగా రష్మిక మందన కి డైరీ రాసుకోవడం అలవాటు తను రోజంతా ఏం చేసింది ఎలా ఉంది అన్న తరహాలో తనకు నచ్చిన విషయాలను డైలీ రూపంలో రాసుకుంటూ తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. సోమవారం రష్మిక చేసిన పనుల గురించి చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే ఒక విషయం చెప్పింది రష్మిక. ఆ విషయమే ఇలాంటి ఒక వార్త రావడానికి కారణమయ్యింది.అయితే రష్మిక మందన సోమవారం చేసిన పనులు ఏంటి? ఆరోజు ఎంతో ఇంట్రెస్టింగ్ గా గడిచింది.. లేచాను లేచిన వెంటనే కార్డియో ఎక్సర్సైజ్ చేశాను.. తర్వాత కొంచెం తిన్నానుమ్ రేపటి కోసం అన్ని సర్దుకున్నాను.. ఆరా స్నోలు నేను బయటకు వెళ్లకుండా అడ్డుకుంటూ నాటకాలు వేసాయి..

కొత్త వర్కౌట్లను చేశాను తర్వాత డిన్నర్ కూడా చేశాను మీటింగ్ కాస్త క్యాన్సిల్ అయింది.. దాంతో తిరిగి ఇంటికి వచ్చి పడుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.ఇందులో భాగంగానే డెర్మట్ అంటే డెర్మటాలజిస్ట్ అని అర్థం. ఇందులో భాగంగానే చర్మానికి సంబంధించిన ఒక సమస్య కారణంగానే డెర్మట్ తో అపాయింట్మెంట్ జరిగే ఉంటుంది అని అందుకే డెర్మటను సంప్రదించి ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు. ఈ విషయాలపై రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ రష్మిక మందన మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. ఈ నేపద్యంలోనే నిజంగా రష్మిక మందన అలాంటి ఒక వ్యాధితో బాధపడుతుందా అందుకే డెర్మటాలజిస్ట్ ను కలిసిందా లేదా వేరే ఇతర కారణాల వల్ల రష్మిక మందన డెర్మటాలజిస్ట్ ను సంప్రదించిందా అన్నది తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: