తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించిన కిరణ్ ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో మంచి సక్సెస్ ను అందుకున్న ఈ యువ హీరో ప్రస్తుతం మీటర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. రమేష్ కాడురి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సాయి కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకులను మంచి ఆదరణ లభించింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా రేపు అనగా మార్చి 24 వ తేదీన ప్రమోషన్ టూర్ ను నిర్వహించనున్నట్లు అందుకు సంబంధించిన అప్డేట్ ను కూడా ప్రకటించింది. రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు "ఐ ఎస్ టి ఎస్" ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ... రాజమండ్రి కి వెళ్లనున్నట్లు ... ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు "ఎన్ జి వో" ఫంక్షన్ హాల్ నరేంద్ర సెంటర్ ... తణుకు కు వెళ్లనున్నట్లు ... ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ... తాడేపల్లిగూడెం కు వెళ్లనున్నట్లు ... ఆ తర్వాత రాత్రి 7 గంటల 30 నిమిషాలకు కేఎల్ యూనివర్సిటీ ... విజయవాడ కు వెళ్ళనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: