అయితే లియో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ తరుణంలో తన తదుపరి సినిమా గురించి కూడా విజయ్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ సినిమా ఏంటి అనే విషయం ప్రస్తుతం బయటకు వచ్చి వైరల్ గా మారింది. తెలుగులో నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం కస్టడి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి కూడా మన అందరికీ తెలిసిందే.
దీనిని కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్టు చేయగా, ఈ దర్శకుడి తోనే విజయ్ తన తదుపరి సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా 150 కోట్ల రూపాయల పారితోషకం సైతం విజయ్ కి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. వెంకట ప్రభు తో కలిపి జి ఎస్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రతి సినిమాకి 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే విజయ్ ఇప్పుడు 150 కోట్ల రూపాయలు తీసుకుంటుండటం తో టాలీవుడ్ తర్వాత సౌత్ ఇండియాలోనే అత్యంత ఎక్కువ పారితోషకం తీసుకునే హీరోల్లో విజయ్ చేరిపోయాడు.