అలాగే ప్రియమణి తరుణ్ ల ప్రేమ విషయం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు తరుణ్ తల్లి రోజా రమణి స్వయంగా ప్రియమణి దగ్గరికి వెళ్లి నా కొడుకుతో నీకు పెళ్లి చేస్తాను అని కూడా చెప్పిందట. కానీ మేము జస్ట్ ఫ్రెండ్స్ అని ప్రియమణి ఆ పెళ్ళికి అడ్డు చెప్పిందట.అయితే ప్రియమణి అలా చెప్పడానికి వేరే కారణం ఉందట. అదేంటంటే ప్రియమణి గతంలో సినిమాల్లో నటిస్తున్న టైంలో ఓ సీనియర్ హీరోతో ప్రేమలో పడింది.
చాలా రోజులు వీరి మధ్య రిలేషన్ కూడా కొనసాగిందట. ఇక ఎప్పుడైతే నవ వసంతం సినిమాలో తరుణ్ తో నటించిందో అప్పటినుండి తరుణ్ తో ప్రేమలో పడిందట.అలా ఆ సినిమా తర్వాత చాలా రోజుల తరుణ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిందట. కానీ పెళ్లి చేసుకుందాం అనుకునే టైం లో ప్రియమణి ముందుగా ప్రేమించిన ఆ హీరో ప్రియమణి ని బ్లాక్మెయిల్ చేశాడట. దాంతో ప్రియమణి తరుణ్ కి దూరం కావాల్సి వచ్చిందట.లేకపోతే ప్రియమణి తరుణ్ ని పెళ్లి చేసుకొని ఉండేదట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి