సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు వస్తుంటారు. కానీ అలా వచ్చే వారిలో కొంత మంది మాత్రమే చాలా సంవత్సరాలు సక్సెస్ ఫుల్ గా సినిమా ఇండస్ట్రీ లో దర్శకులుగా కొనసాగుతూ ఉంటారు. అలా చాలా సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో వరసగా విజయాలను అందుకుంటు అతి తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా మారిపోయాడు. అలా టాప్ దర్శకుల్లో ఒకరిగా మారిపోయిన తర్వాత ఈ దర్శకుడు కొన్ని అపజయాలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్నాడు.

అయినప్పటికీ ఈయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇలా ఉంటే కొంతకాలం క్రితం ఈ దర్శకుడు రామ్ పోతినేని హీరోగా నిది అగర్వాల్ ... నబా నాటేష్ హీరోయిన్ లుగా ఈస్మార్ట్ శంకర్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ "లైజర్" అనే పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీతో పూరి క్రేజ్ కూడా కాస్త తగ్గింది. ఇలా లైగర్ మూవీ తో ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచిన పూరి తనకు అద్భుతమైన విజయం అందించినటువంటి ఈస్మార్ట్ శంకర్ మూవీ కి సీక్వల్ గా డబల్ ఈస్మార్ట్ అనే మూవీ ని ప్రకటించాడు.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 8 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. మరి పూరి "డబల్ ఈస్మార్ట్" మూవీ తో ఈస్మార్ట్ శంకర్ రేంజ్ సక్సెస్ ను అందుకుంటాడో ... లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: