హిమాలయాలకు వెళ్లేముందు ఆ హీరోని విష్ చేసిన రజిని?

సూపర్ స్టార్ రజనీకాంత్‌ నాలుగేళ్ల తరువాత హిమాలయ టూర్‎కు సిద్ధం అయ్యారు. నెల్సన్‌ దిలీప్ కుమార్ డైరెక్షన్‎లో రజనీకాంత్‌ హీరోగా నటించిన 'జైలర్‌' సినిమా ఈరోజు విడుదల అయ్యింది.సీనియర్ నటులు మోహన్‌లాల్‌, జాకీష్రాఫ్‌, శివరాజ్‌కుమార్‌ ఇంకా రమ్యకృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. సాధారణంగా తన సినిమా రిలీజ్ అయ్యే సమయంలో హిమాలయాలకు వెళ్లడం రజనీకాంత్‎కు అలవాటు. అదే అలవాటును ఇప్పటికీ కొనసాగిస్తున్నారు మన సూపర్ స్టార్. అందుకే ఆయన జైలర్ సినిమా రిలీజ్ ఉండటంతో ఆయన హిమాలయాలకు పయనమయ్యారు. రజనీకాంత్ ఈ ఏజ్‎లో కూడా ఎంతో ఉత్సాహంగా హిమాలయాలకు వెళుతుండటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన ఫిట్‎నెస్‎కు ఫిదా అవుతున్నారు.సూపర్ స్టార్ రజనీకాంత్‌‎కు ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువ. ఆ విషయం కూడా ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. 


ఆయన మాట్లాడే ప్రతి మాటలో కూడా ఖచ్చితంగా తాత్వికత కనిపిస్తుంటుంది. ఆ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కోసం ఆయన ప్రతీ సంవత్సరం కూడా హిమాలయాలకు వెళ్తుంటారు. అక్కడి నిర్మలమైన, ఆహ్లాదకరమైన ఇంకా సుందరమైన ప్రకృతిలో కొన్ని రోజులు ఏకాంతంగా గడుపుతారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత నాలుగేళ్లుగా ఆయన హిమాలయాలకు వెళ్లడం లేదు. ఇక ఈ నేపథ్యంలో జైలర్ రిలీజ్ సమయంలో ఆయన హిమాలయా యాత్రకు పయనమయ్యారు. సుమారు ఓ వారం రోజులు ఆయన హిమాలయాల్లోనే గడపనున్నారని సమాచారం తెలుస్తోంది.ఈ నేపథ్యంలో హిమాలయాలకు వెళ్లేముందు యంగ్ హీరో శివ కార్తికేయన్ ని పిలిచి మహా వీరుడు సినిమా సక్సెస్ అయ్యినందుకు విష్ చేశారట.ఇక సూపర్ స్టార్ తాజా సినిమా జైలర్ అయితే తెలుగు తమిళ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. చాలా కాలం తరువాత రజినీకాంత్ సక్సెస్ అందుకున్నందుకు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: