ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బిగ్ బాస్ సీసన్ 7 ప్రారంభమయింది. ఇప్పటికే విజయవంతంగా 9 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. తాజాగా 9 వ ఎపిసోడ్ లో మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ రచ్చ చేసాడు. తాను నామినెటే ిన సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో పిచ్చి వాడిలా అరుస్తూ హౌస్ అంత గబ్బు పట్టించాడు. కానీ ఇప్పుడు పల్లి ప్రశాంత్ కు అండగా మాజీ  బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ నిలిచాడు. అఖిల్ సార్థక్  బిగ్ బాస్ సీసన్ 4 కంటెస్టెంట్. ఇతను ఇప్పుడు బిగ్ బాస్  హౌస్ లో పల్లవి ప్రశాంత్ ప్రవర్తనను సమర్ధించాడు.

పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ అఖిల్ అందరు అతన్ని బిగ్ బాస్ చూసి వచ్చాడు అంటున్నారు...ఆలా వస్తే ఏంటి? అందులో తప్పేముంది అంటూ ప్రశాంత్ ను సపోర్ట్ చేసాడు. "సీరియల్స్ లో టీవీ షోస్ లో నటించే ఆర్టిస్టులు కూడా లోపల తమ భావోద్వేగాలను ఆపుకోలేరు. అలాంటిది ఒక సాధారణ రైతు బిడ్డ. పల్లెటూరు నుంచి వచ్చాడు. అతను కాస్త వర్గా రియాక్ట్ ఐతే తప్పేమిటి? తన లవ్ ట్రాక్ తో కామెడీ పండించాలని చూస్తున్నాడేమో ? అది అతను ఆడుతున్న ఆట. అతని ఇష్టం. తనకు వాచినట్టు ప్రయత్నిస్తున్నాడు." అని చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ కు అందరు భయపడ్డారని అందుకే అతన్ని ఎలిమినేట్ చెయ్యడానికి చూస్తున్నారని అన్నడ్డు అఖిల్.

ఐతే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ పదే పదే తన రైతు బిడ్డ టాగ్ ను వాడుకోవడం మిగతా కంటెస్టెంట్స్ కి నచ్చడం లేదు. దీంతో అందరు కలిసి ప్రశాంత్ ను టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. సెంటిమెంట్ ని వాడుకోవడం కాదు...నామ్నాషన్ టైములో ఎలా ఉంటున్నావో మిగతా టైములో కూడా అలానే ఉండాలి అంటూ ప్రశాంత్ కు కౌంటర్ వేశారు. ఇలా నడరు ప్రశాంత్ కు వ్యతిరేకంగా మారడంతో అఖిల్ అతనికి అండగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: