
అందులో భాగంగానే నిన్న హైదరాబాదులో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ చేపట్టడం జరిగింది. ఇక ఇందులో భాగంగా చంద్రముఖిగా నటిస్తున్న కంగనా రనౌత్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ లో పాల్గొనగా మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నిస్తూ.. మీకు మరోసారి ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే నటిస్తారా? అంటూ ప్రశ్నించగా తప్పకుండా నటిస్తాను అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి అయితే ప్రభాస్ తో మళ్ళీ నటించాలన్న తన కోరికను ఈ విధంగా బయటపెట్టేసింది కంగనా రనౌత్. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. కంగనా కూడా వరుస బాలీవుడ్ సినిమాలతో పాటు తమిళ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇకపోతే ప్రభాస్ సరసన నటించడానికి తాను ఇష్టపడతానని.. ఆయన సక్సెస్ చూస్తే తనకు చాలా ఆనందంగా ఉంటుందని ఆమె తెలిపింది. ఇక ఏక్ నిరంజన్ సినిమా సమయంలో తన ఫామ్ హౌస్ నుంచి ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకొచ్చేవారు అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ ఇచ్చిన ఆతిథ్యాన్ని గుర్తుచేసుకుంది కంగనా. ఇక ప్రభాస్తో అవకాశం వస్తే కచ్చితంగా నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆమె చెప్పడంతో పాటు ప్రభాస్ కి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్టుగా కూడా వెల్లడించింది. మరి మరోసారి వీరిద్దరి కాంబినేషన్ సెట్ చేసే డైరెక్టర్ ఎక్కడున్నారో తెలియాల్సి ఉంది.