సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ మధ్య కాలంలో వెంకీ మామ సినిమా లకు ఎప్పుడు లేనంత హైప్ ఈ సినిమా కు క్రియేట్ అయ్యింది.వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''సైంధవ్''.ఈ సినిమాతో వెంకటేష్ కూడా ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు. ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.. హిట్ సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో ఈసారి వెంకీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు..

 సంక్రాంతి బరిలో దిగబోతున్న ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ కాగా మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ఈ రోజు దీపావళి కానుకగా మరొక పోస్టర్ రిలీజ్ చేసారు.. దివాళి పోస్టర్ తో ఫస్ట్ సింగిల్ గురించి అప్డేట్ ఇచ్చారు.   ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ''రాంగ్ యూసేజ్'' అంటూ వెంకీ మామపై ఒక పార్టీ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు..

నవంబర్ 21న విడుదల చేస్తున్నట్టు తెలిపారు.. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.. కాగా వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్ న( Shraddha Srinath )టిస్తుండగా.. ఆండ్రియా, రుహనీ శర్మ కూడా కీ రోల్స్ పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: