భారీ బడ్జెట్ తో రూపొందుతున్న అడివి శేష్ 'G2' మూవీలో బాలీవుడ్ అగ్ర హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నట్లు తాజా సమాచారం. సినిమాలో ఇమ్రాన్ హష్మీ రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉండనున్నట్లు తెలిసింది. ఇప్పటికే బాలీవుడ్ లో 'టైగర్ 3' అనే స్పై యాక్షన్ మూవీలో తన విలనిజంతో ఆకట్టుకున్న ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు అడివి శేష్ 'G2' లో మరోసారి ప్రతి నాయకుడిగా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మూవీ టీం నుంచి దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ తో అడవి శేష్ సినిమాకి బాలీవుడ్ లో మరింత క్రేజ్ దక్కే అవకాశం ఉంది.
టాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా భారీ క్రేజ్ తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ ఎవరూ ఊహించని విధంగా సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' సినిమాతో విలన్ గా మారాడు. యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా తలకెక్కిన ఈ సినిమాకి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. కత్రినాకైఫ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గత ఏడాది రిలీజై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలనిజానికి మంచి మార్కులు పడ్డాయి.