![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore//images/categories/movies.jpg)
ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ కొన్ని మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఈ మూవీ కధకు సంబంధించి కొన్ని లీకులు ఇస్తున్నాడు. ఆఫ్రికన్ అడవుల నేపధ్యంలో కొనసాగే ఒక థ్రిల్లర్ కథ అంటూ ఒక లీకు వచ్చింది. దీనితో సోషల్ మీడియాలో చాలమంది రచయితలుగా మారిపోయి ఎవరి స్థాయిలో వారు ఈ మూవీ కథ పై అనేక ఊహాగానాలు చేస్తున్నారు.
ఇప్పుడు ఈ ఊహాగానాలు అన్నింటికీ చెక్ పెట్టె సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం ఏప్రియల్ నెలలో రాబోతున్న ‘ఉగాది’ పండుగరోజున రాజమౌళి భాగ్యనగరంలో ఒక జాతీయ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను అదేవిధంగా కీలక నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది మారెప్పుడు విడుదల అవుతుంది అన్న విషయాల పై కూడ క్లారిటీ ఇస్తాడని అంటున్నారు.
మహేష్ కెరియర్ లో మాత్రమే కాకుండా రాజమౌళి కెరియర్ లోనే అతి పెద్ద భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈ మూవీ బడ్జెట్ సుమారు 800 కోట్ల రేంజ్ లో ఉంటుందని వస్తున్న వార్తల నేపధ్యంలో రాబోతున్న ఉగాది పండుగ రోజున రాజమౌళి ఈ భారీ మూవీ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి విషయాలు వెల్లడిస్తాడో అన్న ఆశక్తి అందరిలోను ఉంది..