తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరడంతో దాటడంతో ఇతర భాషల నటీనటులు సైతం తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు బాలీవుడ్ యాక్టర్స్ అతీతం కాదు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలియా భట్ నుంచి మొదలుకొని జాన్వీకపూర్ వరకు టాలీవుడ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరికొందరు తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తున్నారు. ఈ లిస్టులో మరో బాలీవుడ్ హీరోయిన్ చేరిపోయింది. తాజాగా ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఆ హీరోయిన్ పేరు ఆయేషా ఖాన్. 

ఈమె తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్ 17 ద్వారా బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ కి వెళ్లకముందు హిందీలో పలు సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయేషా ఖాన్ 'బహుముఖం' అనే చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక రీసెంట్ గా హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ 17 తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆయేషా ఖాన్ ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్స్ తో బిజీబిజీగా గడుపుతోంది. ఇప్పటికే విశ్వక్ సేన్ నటించిన 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' లో స్పెషల్ సాంగ్ లో నటించిన ఈ బ్యూటీ.. లేటెస్ట్ గా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలో

 శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న 'ఓం భీమ్ బుష్' లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'లక్కీ భాస్కర్' లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో సినిమా ఆఫర్ కూడా దక్కించుకున్నట్లు సమాచారం. అయేషా ఖాన్ నటిస్తున్న ఈ సినిమాల్లో ఏ ఒక్కటి హిట్టయినా ఈ అమ్మడి దశ తిరిగిపోయినట్లే. పైగా ఈ సినిమాలన్నీ ఈ ఇయర్ లోనే రిలీజ్ అవుతుండడం విశేషం. మరి ఈ సినిమాలతో ఆయేషకం తెలుగులో ఇలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: