![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestylead9f4d94-7084-4921-bfa2-5b1875c607fa-415x250.jpg)
అయితే శోభా శెట్టి ప్రస్తుతం సీరియల్స్ లో కనిపించడం లేదు. బిగ్ బాస్ షో అనంతరం ఆమె నటన పట్ల ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి ఓ నిర్ణయం తీసుకుంది. తన ఆలోచనలు అమలులో పెట్టడం స్టార్ట్ చేసింది.బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక శోభ శెట్టి ఒక టాక్ షో చేస్తోంది. సుమన్ టీవీలో కాఫీ విత్ శోభ శెట్టి పేరుతో ఈ టాక్ షో ప్రసారం అవుతుంది. పలువురు సెలెబ్స్ ని ఆమె ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే ఎలాంటి సీరియల్స్ ఒప్పుకోలేదు.ఆమె ఒక మేకప్ స్టూడియో పెట్టింది. తనకు మేకప్ పై అవగాహన ఉన్న నేపథ్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించాలని ఆమె భావిస్తున్నారు. తాజాగా మరో బిజినెస్ స్టార్ట్ చేసింది. సూరత్ వెళ్లిన శోభా శెట్టి అక్కడ హోల్ సేల్ కి చీరలు కొన్నది.ఆ చీరలు తన మేకప్ స్కూల్ వచ్చే కస్టమర్స్ కి అమ్మాలి అనుకుంటుందట. రిటైల్ అండ్ హొల్ సేల్ గా చీరలు అమ్మాలని ఆమె నిర్ణయం తీసుకుందట. ఈ క్రమంలో నటనకు గుడ్ బై చెప్పిన శోభ శెట్టి బిజినెస్ పై దృష్టి పెట్టింది. సీరియల్స్ లో నటించడం వలన వచ్చే ఆదాయం తక్కువే కాబట్టి బిజినెస్ బెటర్ అని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.