ప్రముఖ నటి పెళ్లికి రెడీ అయి పోయింది. తెలుగు సినిమా ల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చు కున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది.గత కొన్నిరోజుల నుంచి వస్తున్న రూమర్స్‌ని నిజం చేసింది. అయితే పెళ్లి కొడుకు విషయం మాత్రం ఎవరూ కనీసం ఊహించ లేదని చెప్పొచ్చు. ఇంతకీ వరలక్ష్మి ఎంగేజ్‌ మెంట్ ఎప్పుడు జరిగింది? ఏంటి విషయం,తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలి గా వరలక్ష్మి అందరి కీ తెలుసు. హీరోయిన్‌ గా కెరీర్ ప్రారంభించిన ఈమె కు పెద్ద గా కలిసి రాలేదు. దీంతో విలన్ తరహా పాత్రలు చేసింది. ఇవి కలిసి రావడంతో అలానే కొన సాగుతూ వచ్చింది. కొన్నేళ్ల వరకు తమిళం లో స్టార్స్‌ తో కలిసి పనిచేసిన ఈమె.. కొన్నేళ్ల క్రితం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, హనుమాన్ తదితర చిత్రాలతో వరస హిట్స్ అందుకుంది.

గతంలో హీరో విశాల్‌తో వరలక్ష్మి ప్రేమాయణం నడిపిందని, కానీ తండ్రికి ఇష్టం లేకపోవడం తో అతడిని వదిలేసు కోవాల్సి వచ్చిందని అన్నారు. కొన్నేళ్ల క్రితం కూడా హీరోలు ధనుష్, శింబుని వరలక్ష్మి పెళ్లి చేసు కోనుందని నెలల గ్యాప్‌లో రూమర్స్ వచ్చాయి. కానీ అవి అలానే మిగిలిపోయాయి. తాజాగా గ్యాలరిస్ట్ నికోలాయి సచ్‌దేవ్ అనే ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది.నికోలయ్‌.. ముంబైకి చెందిన వ్యాపా రవేత్త. ఆర్ట్‌ గ్యాలరీ  లు నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్‌ వేదిక గా వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులు విక్రయిస్తుంటారు. ఇకపోతే ఈ ఏడాదిలోనే వరలక్ష్మి-నికోలాయి పెళ్లి జరగనుంది. గత 14 ఏళ్ల నుంచి వీళ్లిద్దరికీ పరిచయముంది. అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఏదేమైనా 38 ఏళ్ల వయసులో వరలక్ష్మి పెళ్లి చేసుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: