బుల్లితెరపై కామెడీ షో గా ఎంతో మంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో దర్శకులు గాను కమెడియన్లుగాను హీరోలుగాను కొనసాగుతూ ఉన్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన తన అద్భుతమైనటువంటి పంచ్ డైలాగులతో విపరీతమైనటువంటి అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా వచ్చినటువంటి ఆది అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు. ప్రస్తుతం సినిమా లలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఆది మాట్లాడుతూ తాను అసలు జబర్దస్త్ కార్యక్రమం లోకి రావాలని హైదరాబాద్ రాలేదంటూ ఈయన చేసినటు వంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   తాను బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చానని తెలిపారు. ఇలా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఎప్పుడు తన తోటి వారందరినీ నవ్విస్తూ ఉండేవాడిని.అయితే ఒక రోజు అత్తారింటికి దారేది సినిమాలోని ఒక సన్నివేశాన్ని స్పూఫ్ చేసి సోషల్ మీడియా లో షేర్ చేయడం తో అదిరే అభి అన్న చాలా బాగా చేశారు ఒకసారి నన్ను కలువు అంటూ మెసేజ్ చేశారు. ఇక ఆయనని కలిసి తనతో దిగిన ఫోటో ని షేర్ చేయడం తో భారీ సంఖ్యలో లైక్స్ వచ్చాయి ఇలా ఒక మనిషి తో ఫోటో దిగితేనే ఇన్ని లైక్స్ వచ్చాయంటే ఈ కార్యక్రమంలో చేస్తే ఇంకెలా ఉంటుందో అన్న ఉద్దేశంతోనే నేను జబర్దస్త్ కార్యక్రమం లోకి వచ్చాను అంటూ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: