పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్ పార్ట్ 1: సీజ్‍ఫైర్' సినిమా గతేడాది డిసెంబర్‌లో విడుదల అయి భారీ విజయం సాధించింది. అప్పటివరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు సలార్ మూవీ ఊరటను ఇచ్చింది.స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‍గా నిలిచింది. ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్ర పోషించారు.. త్వరలోనే సలార్ మూవీకి సీక్వెల్ 'సలార్ పార్ట్ 2:శౌర్యాంగపర్వం'  విడుదల కానుంది.తాజాగా పృథ్విరాజ్ సుకుమారన్ ఈ మూవీ రిలీజ్‍ డేట్ పై  ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు.. బడే మియా చోటే మియా ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో  పాల్గొన్న పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ 2 మూవీ గురించి స్పందించారు.

సలార్ పార్ట్ 2 సినిమా వచ్చే ఏడాది (2025)లో రిలీజ్ అవుతుందని పృథ్విరాజ్ సుకుమారన్ తెలిపారు.. దర్శకుడు ప్రశాంత్ నీల్ షూటింగ్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. "ప్రశాంత్ నీల్‍కు చాలా సామర్థ్యం ఉంది. ఈ మూవీ షూటింగ్ ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశారు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలుకానుంది. సలార్ 2లో కొన్ని సీక్వెన్సుల చిత్రీకరణ పూర్తి చేసేందుకు నేను ఎంపూరన్ నుంచి బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. 2025లో సలార్ 2 కచ్చితంగా రిలీజ్ అవుతుందని నేను అనుకుంటున్నా" అని పృథ్విరాజ్ సుకుమారన్ తెలిపారు.అయితే సలార్ పార్ట్ 2 కు సంబంధించిన కొన్ని కీలక సీన్లను పార్ట్ 1 షూటింగ్ సమయంలోనే ప్రశాంత్ నీల్ చిత్రీకరించారని సమాచారం.. మిగిలిన భాగాన్ని త్వరగా పూర్తి చేసేలా ఆయన పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. 2025 వేసవికి సలార్ పార్ట్ 2 రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: