![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle4986887a-1277-4f25-9919-85f4c99e05fa-415x250.jpg)
అయితే తాజాగా ఈ సినిమా కు కేజీఎఫ్ హీరో యశ్ కోప్రొడ్యూసర్ గా మారడం విశేషం.యశ్ కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయి.రామాయణం గురించి ప్రపంచానికి చెప్పాలన్నదే ఈ సినిమా ఉద్దేశమని యశ్ తెలిపారు.వెరైటీ మ్యాగజైన్ తో మాట్లాడిన అతడు.. ఈ మూవీ ఎలా ఉండబోతోందో వెల్లడించారు. రామాయణం గురించి ఎన్నిసార్లు చెప్పినా.. ప్రతిసారీ కొత్తగా చెప్పడానికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందని యశ్ తెలిపారు.రామాయణం మనందరికి బాగా తెలుసు అని అనుకుంటాం.కానీ ప్రతిసారీ ఏదో ఓ కొత్త జ్ఞానాన్ని అందించడం తో పాటు ప్రత్యేకమైన దృక్పథాలను పరిచయం చేస్తుంది. ఈ కాలాతీతమైన ఇతిహాసాన్ని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావడమే మా లక్ష్యమని యశ్ వివరించారు..