రీసెంట్ గా మలయాళం భాషలో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'.చిదంబరం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మలయాళంలో 200 కోట్ల పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే తమిళ్ లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టి అక్కడ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా ఈ సినిమా నిలిచింది. అక్కడ తమిళ సినిమాల కంటే ఈ సినిమానే ఎక్కువ వసూళ్ళని నమోదు చేసింది. ఇక ఏప్రిల్ 6 వ తేదీన తెలుగు భాషలో కూడా ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది.‘మైత్రీ మూవీ మేకర్స్’, ‘సుకుమార్ రైటింగ్స్’, ‘ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థలు తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ‘పరవ ఫిలింస్’ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ మూవీని నిర్మించడం జరిగింది. 2006 వ సంవత్సరంలో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న స్నేహితుడిని రక్షించిన మంజుమ్మెల్ అనే గ్రామానికి చెందిన యువకుల నిజ జీవిత అనుభవం ఆధారంగా రూపొందించబడిన ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ఇది.


మొదటి షోతోనే తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా అంతేకాదు రెండు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. ఇంకా ఇప్పటికీ కూడా ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తుంది. ఈ సినిమా  ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే.. ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు రాష్ట్రాల్లో  రూ.2 కోట్ల తక్కువ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.కేవలం 2 రోజులకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయిన ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.2.81 కోట్ల షేర్ ను ఈ సినిమా రాబట్టింది. ఇప్పటి దాకా ఈ సినిమా నిర్మాతలకు రూ.81 లక్షల వరకు లాభాలను అందించింది. కానీ ఒక్కసారి మాత్రం ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అదే యూ ఎస్ లో. యూ ఎస్ లో ఈ సినిమా కేవలం 103 K డాలర్స్ మాత్రమే వసూలు చేసింది. అందువల్ల అక్కడ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీగా నష్టపోయారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా భారీగా లాభాలని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: