సింగం సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన కోలీవుడ్ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో విశాల్ రత్నం అనే సినిమా చేశాడు.కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని హరి తెరకెక్కించారు. ఏప్రిల్ 26న తెలుగు, తమిళ్ భాషలలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని మూవీ యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది. తమిళనాడు, ఆంధ్రా బోర్డర్ లో గ్రామాల మధ్య జరిగిన కథగా ఈ సినిమా స్టోరీని రిప్రజెంట్ చేశారు. ప్రియా భవానీ శంకర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.ప్రేమించే అమ్మాయి కోసం దేనికైనా తెగించే వాడిగా ఈ మూవీలో రత్నం క్యారెక్టర్ లో హీరో విశాల్ నటించాడు. సముద్రఖని, మురళీ శర్మ వంటి నటులు ఇతర పాత్రలలో కనిపించారు. ఈ ట్రైలర్ ని కంప్లీట్ గా యాక్షన్ సీక్వెన్స్ తో మాస్ డైరెక్టర్ హరి నింపేశారు. హరి సినిమాలంటేనే ఆడియన్స్ హెవీ యాక్షన్ సన్నివేశాలను ఖచ్చితంగా ఎక్స్ పెక్ట్ చేస్తారు. దానికి తగ్గట్లుగానే ఈ సినిమా ట్రైలర్ ని డిజైన్ చేశారు.తమిళనాడు నుంచి తిరుపతిని వేరు చేసే సమయంలో ఒక ప్రేమ జంట జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది.


ఇందులో ఆంధ్రా, తమిళనాడు మధ్య గొడవలని దర్శకుడు హరి హైలైట్ చేసినట్లు తెలుస్తుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఫ్యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీలో ఎక్కువగానే ఉన్నాయి.దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. ట్రైలర్ బట్టి చూస్తుంటే సినిమాలో కావాల్సినంత లవ్ ఎమోషన్ తో పాటుగా ఫ్యాన్స్ కోరుకునే పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉండబోతున్నాయని అర్ధమవుతోంది. ఈ మూవీకి కన్నల్ కన్నన్, పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరామన్, విక్కీ స్టంట్ కొరియోగ్రాఫర్స్ గా ఉన్నారు. గౌతమ్ మీనన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించాడు.పవర్ ఫుల్ మాస్ యాక్షన్ మూవీగా విశాల్ నుంచి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు మెప్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మాస్ యాక్షన్ కథలు ఈ మధ్యకాలంలో  రాలేదు. ఈ నేపథ్యంలో రత్నం సినిమాకి విలేజ్ ఆడియన్స్ ని మెప్పించే స్కోప్ బాగా ఉంది. ఆంధ్రా, తమిళనాడు మధ్య గొడవలని హైలైట్ చేస్తున్నారు కాబట్టి రెండు రాష్ట్రాల ఆడియన్స్ ఓన్ చేసుకునే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: