అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తరువాత దేశవ్యాప్తంగా రాముడి మ్యానియా విపరీతంగా పెరిగి పోయింది. ఈ క్రేజ్ ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బాలీవుడ్ ఇండస్ట్రీ కూడ ప్రయత్నిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ త్వరలో నిర్మాణం చేపట్టబోతున్న ‘రామాయణం’ మూవీలో సీత గా సాయి పల్లవి శ్రీరాముడు గా రణబీర్ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమూవీకి సంబంధించి వర్కింగ్ స్టిల్స్ మీడియాకు లీక్ అయ్యాయి.



ఆ స్టిల్స్ ను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు విపరీతంగా సాయి పల్లవి ని ట్రోలింగ్ చేస్తున్నారు. కొందరు సీత లుక్ లో సాయి పల్లవి ఏమాత్రం బాగా లేదని ఆమె ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొన్నట్లు అనిపిస్తోందని కొందరు ఆమెను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.



మరికొందరైతే సాయి పల్లవి ‘కాశ్మీర్ ఫైల్స్’ మూవీ గురించి చేసిన అప్పటి కామెంట్స్ ను వక్రీకరిస్తూ ఆమె ఉదాత్తమైన సీత పాత్రకు ఏమాత్రం సరిపోదు అంటూ మరికొందరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం ఇలాంటి పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్ లో సాయి పల్లవికి అవకాశం దక్కినందుకు ఈర్ష్యతో కొందరు చేస్తున్న నెగిటివ్ కామెంట్స్ అంటూ ఆమెకు బాసటగా నిలుస్తున్నారు.  



శ్రీరాముడి లుక్ లో రణబీర్ కపూర్ ఏమాత్రం బాగా లేడని ఇలాంటి భారీ మూవీ ప్రాజెక్ట్ కు రాజాబీర్ కపూర్ ఎంపిక తప్పు అంటూ నెగిటివ్ ప్రచారం సోషల్ మీడియాలో కొందరు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం సీత పాత్రలో సాయి పల్లవి జీవిస్తుందని అంటూ ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే రెండు భాగాలుగా నిర్మాణం జరుపుకునే ఈ మూవీలో సీతగా నాటిస్తున్నందుకు ఈమెకు 30 కోట్ల పారితోషికం ఇస్తున్నారు అంటూ వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి..





మరింత సమాచారం తెలుసుకోండి: