![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/ottloki-vachesina-bahubali-animated-versione979718c-e611-438f-8caa-8668ff979740-415x250.jpg)
బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ వెబ్ సిరీస్ను ప్రధానంగా హిందీలో తెరకెక్కించారు. అనంతరం తెలుగు, మలయాళం, తమిళం, బెంగాళి, కన్నడ, మరాఠిలో కూడా అనువదించారు. ప్రస్తుతం 8 భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అంతా బాగున్నప్పటికీ ప్రేక్షకులు నిరాశపరిచారు మేకర్స్ అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ నిర్వాహకులు.బాహుబలి ఫ్రాంఛైజీకి ప్రీక్వెల్గా వచ్చిన ఈ సిరీస్ నుంచి కేవలం రెండు ఎపిసోడ్స్ మాత్రమే విడుదల చేశారు. అనంతరం వారానికి ఒక ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేస్తారని తెలుస్తోంది. అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి స్ట్రీమింగ్ చేస్తే బాగుండేదని, కేవలం 2 ఎపిసోడ్స్తో క్యూరియాసిటీని తట్టుకోలేమని నెటిజన్స్, అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉంటే, ఈ యానిమేషన్ సిరీస్ నుంచి ఇదివరకే రెండు ఎపిసోడ్స్ స్క్రీనింగ్ చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో మేకర్స్, ఓటీటీ హెడ్స్ అభిప్రాయాలు పంచుకున్నారు. "బాహుబలి యానిమేషన్ సిరీస్తో దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు, గ్రాఫిక్ ఇండియాతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. యానిమేషన్ సిరీస్లు అంటే పిల్లలకే అనే అభిప్రాయం ఉంది. అయితే మేము బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ను పెద్దల దగ్గరకు కూడా చేర్చాలని అనుకుంటున్నాం" అని డిస్నీ ప్లస్ హాట్స్టార్ కంటెంట్ హెడ్ గౌరవ్ బెనర్జీ తెలిపారు.బాహుబలి వరల్డ్ పెద్దది అని, స్క్రీప్ట్ రాసేటప్పుడు ప్రతి పాత్రకు బ్యాక్ స్టోరీ, క్యారెక్టర్ ఆర్క్, తర్వాత కథను కూడా రాశామని రాజమౌళి పేర్కొన్నారు. ఆ కంటెంట్ అంతా ప్రేక్షకులకు చెప్పాలని ఉండేదన్నారు. మన దగ్గర సినిమా అంటే థియేటర్ రన్ ముగిశాక మరిచిపోతాం. కానీ, వెస్ట్రన్ సినిమాలో మూవీ అంటే ఒక బ్రాండ్ అని, బాహుబలిని కూడా యానిమేషన్ సిరీస్లు, కార్టూన్ బుక్స్, గేమింగ్తో బ్రాండ్ చేయాలని భావించినట్లు దర్శక దిగ్గజం వెల్లడించారు.