![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestylec179c116-61bc-4354-a741-c31e88c12932-415x250.jpg)
సెకండ్ ఇన్నింగ్స్లో తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువగా బిజీ అయ్యాడు సునీల్. గత ఏడాది రజనీకాంత్ జైలర్లో సునీల్ ఓ కీలక పాత్ర చేశాడు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఐదు వందల కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. . జైలర్తో పాటు అతడు నటించిన మార్క్ ఆంటోనీ, మావీరన్ సినిమాలు వంద కోట్ల వసూళ్లను దక్కించుకున్నాయి.తాజాగా టర్బోలో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలో సునీల్ నటించిన ఐదు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలో సునీల్ కామెడీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రామ్చరణ్ గేమ్ ఛేంజర్తో పుష్ప 2లో సునీల్ నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ అవుతోంది.మరోవైపు కొన్నాళ్లు మమ్ముట్టి బ్లాక్బస్టర్ సక్సెస్లతో దూసుకుపోతున్నాడు. కన్నూర్ స్క్వాడ్, కాథల్ ది కోర్, భ్రమయుగం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. కాథల్ ది కోర్లో స్వలింగసంపర్కుడిగా, భ్రమయుగంలో నెగెటివ్ షేడ్స్తో కూడిన క్యారెక్టర్లో అసమాన నటనతో మమ్ముట్టి విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నాడు. తెలుగులో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన యాత్ర 2లో వైఎస్ రాజశేఖర్రెడ్డి పాత్రలో మమ్ముట్టి కనిపించాడు. ప్రస్తుతం మరో నాలుగు మలయాళం సినిమాల్లో హీరోగా నటిస్తోన్నాడు మమ్ముట్టి.