తమిళ నటి శ్రేయ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం విశాల్ హీరో గా రూపొందిన పొగరు సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె పాత్ర కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా ద్వారా శ్రేయ కి మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ తెలుగు లో కూడా విడుదల కావడం ఈ చిత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించడంతో ఈ నటికి పొగరు సినిమాతోనే తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది.

ఆ తర్వాత ఈమె ఎక్కువ సినిమాల్లో నటించలేదు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా సూపర్ గా ఉండడం , అందులో ఈమె పాత్ర కూడా హైలెట్ గా ఉండడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో నా అభిమాన నటి టబు. ఓ తెలుగు మూవీలో టబు కోసం రాసిన పాత్రను నేను చేస్తున్నాను. మొదట టబు గురించి వారు  స్క్రిప్ట్ ను రాశారు. కానీ చివరకు ఆ పాత్ర నాకు వచ్చింది. ఆ అవకాశం రావడం నాకు దక్కిన చాలా పెద్ద విజయం అని నేను భావిస్తున్నాను అని అంది.  ఇక ఈమె ఓజీ సినిమా గురించి ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది అని జనాలు భావిస్తున్నారు.

ఇకపోతే ఓజీ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ మంచి విజయం సాధించినట్లు అయితే శ్రేయా రెడ్డి క్రేజ్ తెలుగు లో మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sr