ఏపీలో ఎన్నికల హడావిడి ఏ విధంగా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇక ఇందులో ఎవరు అధికారం చేపట్టే సీఎం అవుతారనే దానిపై అందరి చూపు పడింది. అయితే ఏపీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు ఏపీ ఎన్నికల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలను చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు శివకృష్ణ ఏపీ పొలిటికల్ లీడర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ నటుడు మాట్లాడుతూ.." తెలంగాణలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఏపీలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. కానీ మంత్రి రోజా, కొడాలి నాని చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లే. ఎందుకంటే వేరే పార్టీ కనుక వాళ్లని తీసుకుంటే రాజకీయాల్లో ఉంటారు.  లేదంటే రాజకీయ జీవితం ముగిసినట్లే " అంటూ వెల్లడించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.." పిఠాపురంలో గెలిచేది పవన్ కళ్యాణ్. 40 వేల నుంచి 50 వేల మెజారిటీతో ఆయన తప్పక గలుస్తారు. ముఖ్యంగా ఆయన మాట తప్పని మనిషి.

ఇప్పుడు పొత్తు రాజకీయ నాయకులు ఎవరూ లేరు. పొత్తుకు ముందు ఏం చెప్పారో అదే చేశారు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన మాటలు నిజం చేస్తారు. ఎవరికి ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదని వైయస్ జగన్ ను ఓడించడం లక్షమన్నారు. అన్నట్లుగానే సీట్లు కేటాయించినా కూడా ఏం మాట్లాడలేదు. అంతేకాకుండా అన్నయ్య నాగబాబుకు ఇచ్చిన ఎంపీ సీటును వదులుకున్నారు. అలా ఎవరుంటారు పవన్ కళ్యాణ్ తప్ప. ఆయన చాలా మంచోడు ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారు. గెలిస్తే కచ్చితంగా చేస్తాడు  " అంటూ కామెంట్స్ చేశారు శివకృష్ణ. ప్రజెంట్ ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: